Advertisement

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి....దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి....దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By: chandrasekar Wed, 18 Nov 2020 5:24 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి....దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ అంటుంటే కరోనా సమయంలో సాధ్యం కాదని ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఈ క్రమంలో ఎస్ఈసీ ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధంకాగా మళ్లీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిషన్ మాత్రమే ఎన్నికలు జరపలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం కూడా సహకరించాలని అధికారులకు డబ్బు సమకూర్చాల్సింది ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని సీఎం అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తారన్నారు. ఎన్నికలు జరపకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు.

Tags :

Advertisement