Advertisement

  • విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు ..

విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు ..

By: Sankar Fri, 16 Oct 2020 11:20 AM

విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు ..


ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్ర స్టేట్‌మెంట్‌ని పోలీసులు శుక్రవారం ఉదయం రికార్డ్‌ చేశారు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇద్దరం కలిసి ఆత్మహత్యకు పూనుకున్నామని నాగేంద్ర తెలిపాడు.

నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు.

కాగా ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

Tags :
|
|

Advertisement