దేశరాజధాని ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు...
By: chandrasekar Mon, 07 Dec 2020 4:36 PM
దేశరాజధాని ఢిల్లీలో
ఐదుగురు ఉగ్రవాదులను షకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ తర్వాత ఢిల్లీ
స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిలో జమ్మూకశ్మీర్కు చెందిన వారు
ముగ్గురు, పంజాబ్కు
చెందిన వారు ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా
పేర్కొన్నారు. ముందుగా ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని, ఆతర్వాత
వారిని పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
అదుపులో ఉన్న ఉగ్రవాదులు
ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది ఇంకా తెలియరాలేధు. ఈ ఐదుగురు ఉగ్రవాదుల నుంచి
ఆయుధాలు, మందుగుండు
సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుతో దేశ రాజధాని నగరంలో
మరో ఉగ్రదాడి కుట్రను పోలీసులు విఫలం చేశారు. అయితే దర్యాప్తు జరుగుతోందని
పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. 20రోజుల కిందట ఢిల్లీలో ఉగ్రదాడికి వ్యూహం పన్నిన
ఇద్దరు జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసిన విషయం
తెలిసిందే. అప్పుడు కూడా వారి నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం
చేసుకున్నారు.