Advertisement

  • మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు

By: chandrasekar Fri, 04 Sept 2020 9:58 PM

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు


ఉత్తర్ ప్రదేశ్‌లో గురువారం మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడి అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన ఘటన తెలిసిందే. తాజాగా, ఆ కామాంధుడు శుక్రవారం జరిగిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకున్న కేవలం 20 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మైనర్ బాలికలు హత్యాచారానికి గురయ్యారు. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి తన ఇంటికి 500 మీటర్ల దూరంలోని పొలాల్లో శవమై దొరికింది. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన లేఖ్‌రామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తొలుత దీనిని హత్యగా ప్రకటించిన పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. పాతకక్షలతోనే నిందితుడు తన కుమార్తెను కిడ్నాప్ చేసి, హత్యచేశాడని బాధిత చిన్నారి తండ్రి ఆరోపించాడు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలించి పట్టుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అతడిని ఎక్‌కౌంటర్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల కిందట లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాల్లోనే ఇంటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్యచేశాడు. ష్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన 17 ఏళ్ల బాలిక.. గ్రామ పొలిమేరల్లో శవమై తేలింది.

Tags :
|
|

Advertisement