సంచలనం రేపిన వలగొండ యువతి మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు
By: chandrasekar Mon, 31 Aug 2020 6:09 PM
పది రోజుల కిందట ఇంటి నుంచి బయటికెళ్లిన యువతి వలిగొండ సమీపంలోని వలిభాష గుట్టల్లో శవమై తేలింది. ఆమె ప్రియుడు నాగిరెడ్డిపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం రేపిన వలగొండ యువతి మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రియుడే ఆమెను నమ్మించి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న రవి ఆమెను చంపాలని నిర్ణయించుకుని స్నేహితుడు రవితేజతో కలసి పథకం రచించాడు. ఈ నెల 18న ఇంటి నుంచి బయటికెళ్లిన యువతిని ప్రియుడు రవి కలవాలని చెప్పడంతో వలిభాష గుట్టల దగ్గరికి వెళ్లింది.
అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే అదే రోజు ఆమె ప్రియుడు రవి భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ఈ కేసుకు సంబంధించి ప్రియుడి స్నేహితుడు, మరో నిందితుడు రవితేజని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో షాకింగ్ నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసు విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.