జోరు వానలో సొంత డబ్బుతో రోడ్డు పనులు చేసిన పోలీస్ కానిస్టేబుల్...వీడియో వైరల్
By: chandrasekar Sat, 17 Oct 2020 1:28 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాలను వర్షాలు ప్రజలను వణికించేస్తున్నాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర
జిల్లాల్లో వరదలు పోటెతున్నాయి. భారీ వర్షాల ప్రభావం తగ్గినా అక్కడక్కడా వానలు
కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి అనేక చోట్ల స్తంభాలు కూలిపోగా, రోడ్లు
తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వర్షాల సమయంలో కూడా
పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ
కానిస్టేబుల్ సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ బ్రిడ్జికి మరమ్మతులు చేశారు. ఏకంగా పార
పట్టుకుని స్వయంగా రోడ్డుకు మరమ్మతులు చేశారు.
ఈ మేరకు విజయనగరం
జిల్లాలో పోలీసు శాఖ ట్వీట్ చేసింది. ‘‘విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన
రావుపల్లి బ్రిడ్జిపై గోతులు ఏర్పడి, రోడ్డు ప్రమాదాలను కారణంగా నిలవగా, అక్టోబరు
16న
కొత్తవలస కానిస్టేబుల్ సురేష్ తన స్వంత ఖర్చులతో గుంతలను పూడ్చే పని చేపట్టారు.’’
అని ట్వీట్లో తెలిపారు.
ప్రస్తుతం కానిస్టేబుల్
సురేష్ రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జోరు వానలో కూడా సొంత డబ్బుతో రోడ్డు పనులు చేసిన పోలీస్ కానిస్టేబుల్కు ప్రజలు
అభినందిస్తున్నారు.