Advertisement

నారా లోకేష్‌పై కేసు నమోదైంది...!

By: Anji Tue, 27 Oct 2020 1:10 PM

నారా లోకేష్‌పై కేసు నమోదైంది...!

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై కేసు నమోదైంది.

అక్కడి రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో లోకేష్‌పై ఐపీసీ 279,184, 54ఎ, ఎపిడమిక్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటించలేదని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేశారు.

అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Advertisement