Advertisement

అమితాబ్ బచ్చన్‌పై పోలీస్ కేసు...

By: chandrasekar Tue, 03 Nov 2020 9:24 PM

అమితాబ్ బచ్చన్‌పై పోలీస్ కేసు...


కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పై లక్నోలోని ఓ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు కావడం బీ టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ షో నిర్వాహకులపై, హోస్ట్ అమితాబ్‌పై పోలీస్ కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారని పేర్కొంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో బిగ్ బీ అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్‌లు సమాధానం ఇస్తుంటారు. ప్రైజ్ మనీని పెంచుకుంటూ పోతూ ఈ షోలో రాజకీయాలు, సినిమాలు, జీకే ఇలా అనేక ప్రశ్నలు కంటెస్టెంట్లను అడుగుతుంటారు. కాగా గత శుక్రవారం నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ పాల్గొనగా ఆయన్ను అడిగిన ఓ ప్రశ్న వివాదానికి తెరలేపింది.

డిసెంబర్‌ 25వ తేదీ1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్నను అడిగారు అమితాబ్. వీటికి `ఎ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి` అని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు జవాబుగా మను స్మృతి అనే ఆన్సర్ ఇచ్చేటపుడు బిగ్ ‌బీ.. మనుస్మృతిని ఆనాడు బీఆర్ అంబేద్కర్ తగలబెట్టిన విషయాన్ని వివరించారు. దీంతో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ ట్రోలింగ్ మొదలైంది. ఈ మేరకు ఓ వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో పాటు కేబీసీపై కేసు నమోదు చేశాడు.

Tags :
|
|

Advertisement