Advertisement

  • శ్రావణి ఆత్మహత్య కేసులో దేవ్‌రాజ్ రెడ్డి మరియు సాయికృష్ణారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు

శ్రావణి ఆత్మహత్య కేసులో దేవ్‌రాజ్ రెడ్డి మరియు సాయికృష్ణారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు

By: chandrasekar Mon, 14 Sept 2020 09:27 AM

శ్రావణి ఆత్మహత్య కేసులో దేవ్‌రాజ్ రెడ్డి మరియు సాయికృష్ణారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు


శ్రావణి ఆత్మహత్య కేసులో దేవ్‌రాజ్ రెడ్డి మరియు సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు అనుమానాల నడుమ నడుస్తున్న ఈ కేసు ఆమె తల్లిదండ్రుల అందించిన పిర్యాదు మేరకు ఇద్దరు అరెస్టు చేయబడ్డారు. టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. శ్రావణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవ్‌రాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరిని రేపు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డి సోమవారం పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే శ్రావణి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ప్రేమ పేరుతో దేవరాజ్‌ రెడ్డి వేధించడం వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నదని సాయి ఆరోపిస్తుండగా, సాయి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని దేవరాజ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందువల్ల ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Tags :

Advertisement