Advertisement

బెట్టింగ్ ముఠా అరెస్ట్ ..9 లక్షలు స్వాధీనం

By: Sankar Fri, 09 Oct 2020 11:56 AM

బెట్టింగ్ ముఠా అరెస్ట్ ..9 లక్షలు స్వాధీనం


ఐపీఎల్‌పై బెట్టింగ్ రాయుళ్లు జోరు ఓ వైపు కొనసాగుతుంటే.. మరో వైపు వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్‌లో నిన్న జరిగిన హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ లో భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌ఓటీ బాలనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు

భూదేవి నగర్‌లోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలనగర్ ఎస్‌ఓటీ పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని ఎస్‌ఓటీ పోలీసులు అల్వాల్‌ పోలీసులకు అప్పగించారు.

కాగా ఐపీయల్ ఉండటం వాళ్ళ బెట్టింగ్ రాయుళ్లు జోరు అందుకున్నారు ..ఎక్కువగా కాలేజీ యువతే లక్ష్యంగా ఈ బెట్టింగ్ లు జరుగుతుంటాయి ..

Tags :
|

Advertisement