Advertisement

  • ఒక దేశాధ్యక్షుడికి కరోనా ..క్వారంటైన్ కు వెళ్లిన ఇంకో దేశాధ్యక్షుడు

ఒక దేశాధ్యక్షుడికి కరోనా ..క్వారంటైన్ కు వెళ్లిన ఇంకో దేశాధ్యక్షుడు

By: Sankar Sun, 25 Oct 2020 08:34 AM

ఒక దేశాధ్యక్షుడికి కరోనా ..క్వారంటైన్ కు వెళ్లిన ఇంకో దేశాధ్యక్షుడు


ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు ప్రపంచంలో 4.20 కోట్లకు పైగా నమోదయ్యాయి. యూరప్ ఖండంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి సెకండ్ వేవ్ మొదలు కావడంతో అక్కడి దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి.

సెకండ్ వేవ్ వస్తే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే హెచ్చరించింది. సామాన్యుల నుంచి రాజకీయనాయకులు, దేశాధ్యక్షులు ఎవర్ని కరోనా వదలడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో పాటు అనేక దేశాలకు చెందిన ప్రధానులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా పోలండ్ దేశాధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం నిలకడగానే వుందని ప్రకటించారు. అయితే, ఇటీవలే బల్గెరియా అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ పోలండ్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. పోలండ్ అధ్యక్షుడికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే బల్గెరియా అధ్యక్షుడు కూడా హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.

Tags :
|
|
|

Advertisement