పోకో ఎం2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్...రూ.11 వేల లోపు ధరలో
By: chandrasekar Wed, 09 Sept 2020 1:00 PM
పోకో ఎం2
ప్రోకు టోన్డ్ డౌన్ వెర్షన్ గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. రూ.11 వేల
లోపు ధరలో ఈ ఫోన్ లాంచ్ కాగా, ఇందులో ఆ ధరకు తగ్గ ఫీచర్లనే అందించారు. ఆక్టాకోర్
ప్రాసెసర్, వెనకవైపు నాలుగు కెమెరాలు, అతి
పెద్ద బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఇందులో రెండు వేరియంట్లు, మూడు
కలర్ ఆప్షన్లను షియోమీ లాంచ్ చేసింది.
పోకో ఎం2 ధర
దీనిలో రెండు వేరియంట్లను
పోకో లాంచ్ చేసింది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గానూ, 6 జీబీ
ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గానూ నిర్ణయించారు. పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్
15వ
తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు
స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.53
అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను రియల్ మీ అందించింది. గొరిల్లా గ్లాస్ 3
ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్
పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్,
128 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్
డీ కార్డు ద్వారా ఇందులో స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం ఉంది
దీనిలో వెనకవైపు నాలుగు
కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా
వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా
పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఉన్నాయి.
సెల్ఫీల కోసం ముందువైపు 8
మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం2
పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా,
18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా దీనిలో ఉంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్
వోల్టే సపోర్ట్, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం
హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్ప్లాష్
రెసిస్టెన్స్ కూడా ఉంది.