పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన...
By: chandrasekar Tue, 22 Sept 2020 7:15 PM
కేంద్ర ప్రభుత్వం ఎన్నో
రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. ఇది
మంచి రిటైర్మెంట్ స్కీ్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి ప్రతి నెలా
చేతికి పెన్షన్ లభిస్తుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. పీఎం
శ్రమ్ యోగి మాన్ధన్ యోజన కింద నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. అంటే సంవత్సరానికి చేతికి రూ.36,000 వస్తాయి. 60 ఏళ్లు దాటిన తర్వాతనే ప్రతి నెలా పెన్షన్ వస్తుందనే
విషయాన్ని గుర్తించుకోవాలి. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పథకంలో చేరేందుకు అర్హలు.
కార్మిక శాఖ ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 45 లక్షల మంది ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 ఏళ్ల
వయసులోనే ఈ స్కీమ్లో చేరితో నెలకు రూ.55 చెల్లిస్తూ రావాలి. ఇలా ప్రతి నెలా మీకు 60 ఏళ్లు
వచ్చే వరకు రూ.55 కడుతూ రావాలి. నెలకు రూ.55 అంటే
రోజుకు దాదాపు రూ.2 అవుతుంది. రోజుకు రూ.2 ఆదా చేసుకుంటే నెలకు రూ.3,000
లేదంటే సంవత్సరానికి రూ.36 వేలు పొందొచ్చు.
అదే 29 ఏళ్ల
వయసులో ఈ స్కీమ్లో చేరితే అప్పుడు నెలకు రూ.100 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ఈ పని చేయాలి. అదే 40 ఏళ్ల
వయసులో ఈ పథకంలో చేరితే అప్పుడు నెలకు రూ.200 చెల్లించాలి. మీరు చెల్లించే మొత్తానికి సమానమైన
మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మీ పేరుపై స్కీమ్కు చెల్లిస్తుంది. అసంఘటిత రంగంలోని
వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. వలస కూలీలు, కార్మికులు, ఎలక్ట్రీసియన్, స్వీపర్స్
వంటి వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. నెలకు రూ.15,000లోపు జీతం వచ్చే వారు కూడా ఈ స్కీమ్లో చేరేందుకు
అర్హులు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ఉంటే ఈ స్కీమ్లో చేరొచ్చు. దగ్గరిలోని
సీఎస్సీ సెంటర్కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. 1800 267 6888 నెంబర్కు కాల్ చేసి
కూడా స్కీమ్ వివరాలు తెలుసుకోవచ్చు.