- హోమ్›
- వార్తలు›
- 9 రాష్ట్రాల సీఎం లతో పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్ ..జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
9 రాష్ట్రాల సీఎం లతో పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్ ..జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
By: Sankar Tue, 11 Aug 2020 10:34 AM
భారత్ లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది ..ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదు అయితున్నాయి .. దీంతో ఈ పరిస్థితుల్లో మరోసారి 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు..
ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు... అస్సోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండటం, కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న కరోనా కేసులు ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై మోదీ, ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 9 రాష్ట్రాల్లో భాగంగా ఏపీ, తెలంగాణ సీఎంలతోనూ ప్రధాని మోదీ చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ వీడియో సమావేశంలో పాల్గొననున్నారు.