Advertisement

  • ఎటువంటి భద్రత లేకుండా గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ

ఎటువంటి భద్రత లేకుండా గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ

By: Sankar Sun, 20 Dec 2020 10:08 PM

ఎటువంటి భద్రత లేకుండా గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్‌ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌బహదూర్’‌ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

ఇది న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ భవనానికి సమీపంలో ఉంది. అయితే ప్రధాని గురుద్వారా సందర్శన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్‌ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు.

కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు..పర్యటనలో ప్రధాని మోదీ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు

Tags :
|
|

Advertisement