దేశ యువతకు సరికొత్త ఛాలెంజ్ విసిరిన ప్రధాని మోడీ ..
By: Sankar Sat, 04 July 2020 8:46 PM
ఇండియా చైనా సంఘర్షణల నేపథ్యంలో కేంద్రం ప్రజల భద్రత దృష్ట్యా చైనాకు చెందిన యాప్స్ ను నిషేదించిన సంగతి తెలిసిందే ..దీనితో దేశీయ యాప్స్ కు వీపరీతమైన డిమాండ్ ఏర్పడింది ..దీనికి మంచి ఉదాహరణ టిక్ టాక్ స్థానం లో వచ్చిన చింగారి యాప్ ..టిక్ టాక్ నిషేధం తర్వాత చింగారి యాప్ రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ నమోదు చేసింది ..అయితే ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్న సాఫ్ట్వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్ కంపెనీలు, స్టార్టప్లను ప్రధాని మోదీ కోరారు. మెయిటీ , అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి.
ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి, కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆయా విభాగాల్లో డెవలప్ చేసే అత్యుత్తమ యాప్లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్ డెవలపర్లు, స్టార్టప్ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ చాలెంజ్లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి.