వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25 న రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ
By: Sankar Sun, 20 Dec 2020 11:03 AM
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషించనున్నట్లు బీజేపీ తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని 2500కిపైగా ప్రదేశాల్లో బీజేపీ ‘కిసాన్ సంవాద్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సన్నాహాలను ముమ్మరం చేసింది. యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్సింగ్, పార్టీ నేత రాధామోహన్ సింగ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఆ పార్టీ శ్రేణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం పేదల, రైతుల సంక్షేమానికి అంకితమైందని రాధామోహన్ సింగ్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
Tags :
interact |
farmers |