Advertisement

  • తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోడీ

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోడీ

By: Sankar Sat, 29 Aug 2020 9:24 PM

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోడీ


తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన స్వయంగా తెలుగులోనే ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి సేవ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

లాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గిడుగు వేంకట రామమూర్తి పంతులు జయంతి, తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని “మనభాష-మన సమాజం-మన సంస్కృతి” అంతర్జాల సదస్సు నిర్వహణ అభినందనీయం. ఇందు కోసం చొరవ తీసుకున్న దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య, ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ఇతర సంస్థలకు అభినందనలు

Tags :
|
|

Advertisement