Advertisement

  • కరోనా పరీక్షలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది ..నరేంద్ర మోడీ ...

కరోనా పరీక్షలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది ..నరేంద్ర మోడీ ...

By: Sankar Tue, 24 Nov 2020 5:22 PM

కరోనా పరీక్షలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది ..నరేంద్ర మోడీ ...


కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కరోనా పరీక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కరోనాను భారత్ ధైర్యంగా ఎదుర్కొంది కానీ ప్రజలే కరుణా ని లైట్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని మోడీ అన్నారు ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్లు పిఎంకె ఆర్ ఫండ్స్ వినియోగించాలన్న అయన కొందరు నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక కేసీఆర్ ఈ వ్యాక్సిన్‌ గురించి మాట్లాడుతూ దానిని పంచేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమన్నా ఉంటాయనేది నిర్థారించాల్సి ఉందన్నారు.

వ్యాక్సిన్‌ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని అన్నారు. రాష్ట్రంలో మొదటగా కొందరికి కొన్ని డోసుల చొప్పున ఇవ్వాలని సీఎం సూచించారు. 15 రోజులు పరిశీలించిన తర్వాత మిగతా వారికి ఇవ్వాలని అన్నారు.

Tags :
|
|

Advertisement