Advertisement

  • కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోడీ...!

కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోడీ...!

By: Anji Sat, 12 Dec 2020 6:21 PM

కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోడీ...!

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల ఆదాయం పెంచడానికే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు.

సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు కొత్త సాగు చట్టాలతో తొలగిపోయాయన్నారు ప్రధాని.

కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్నామ్నాయాలను వెతుక్కొవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొత్త వ్యవసాయ బిల్లులపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

కొత్త చట్టాలతో రైతులు తామ పండించిన పంటలను మార్కెట్లు లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా దేశ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను ఆధునికీకరిస్తామని తెలిపారు.

కొత్త సాగు చట్టాలతో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు.

రైతులకు ప్రయోజనాల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మరోవైపు రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. దీంతో ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది.

ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విజ్ఞప్తి చేశారు. అయితే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటిస్తే తప్ప తాము ఉద్యమాన్ని ఆపేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

Tags :

Advertisement