ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..
By: Sankar Thu, 17 Sept 2020 11:57 AM
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అమిత్ షాతో సహా పలవురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్ వేదికగా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘మోదీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. నేడు నేను దేశ ప్రజలందరితో కలిసి ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని అమిత్ షా హిందీలో ట్వీట్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ, పేదలు, అట్టడుగున ఉన్నవారి సాధికారత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆయన నాయకత్వంలో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చురుకైన నాయకత్వం, దృఢ సంకల్పం, నిర్ణయాత్మక చర్యల వల్ల భారతదేశం ఎంతో ప్రయోజనం పొందింది. ఆయన పేదలు, అట్టడుగున ఉన్నవారికి సాధికారత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. మోదీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు..
ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.' ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ గవర్నర్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'దేశ సేవకు అంకితమైన మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. దేశానికి మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం మాకు ఆశీర్వాదం.'అంటూ తెలిపారు.