Advertisement

  • బీజేపీ దిగ్గజ నేత అడ్వాణీ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ..

బీజేపీ దిగ్గజ నేత అడ్వాణీ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ..

By: Sankar Sun, 08 Nov 2020 8:42 PM

బీజేపీ దిగ్గజ నేత అడ్వాణీ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ..


బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఆదివారం (నవంబర్ 8) 93వ వడిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వదం తీసుకున్నారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేయించి పుట్టిన రోజు వేడులకును జరిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు.

అద్వానీ జీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాం. ఆయనతో సమయం గడపడం ఎల్లప్పుడూ నాకు ఆనందదాయకం. నా లాంటి కార్యకర్తలకు అద్వానీ జీ మద్దతు, మార్గనిర్దేశనం అమూల్యమైనవి. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అపారమైనది’ అని మోదీ ట్వీట్ చేశారు.

Tags :
|

Advertisement