- హోమ్›
- వార్తలు›
- వారి త్యాగాలు , సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాము ...పోలీసుల సంస్మరణ దినం సందర్బముగా మోడీ ట్వీట్
వారి త్యాగాలు , సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాము ...పోలీసుల సంస్మరణ దినం సందర్బముగా మోడీ ట్వీట్
By: Sankar Wed, 21 Oct 2020 11:40 AM
ఇవాళ అమర పోలీసుల సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసులకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
వారి త్యాగాలు, సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. శాంతి, సామరస్య స్థాపనలో, క్రూరమైన నేరాలను పరిష్కరించడంలో, కోవిడ్19 లాంటి మహమ్మారి వేళ పోలీసులు చూపిన సాహసం అనన్యమైందని ప్రధాని అన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా వారు సేవ చేస్తారన్నారు. పౌరులకు సహకరించేందుకు వారెప్పుడూ సిద్ధంగా ఉంటారని, దాని పట్ల గర్వంగా ఉందని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఢిల్లీలోని నేషనల్ పోలీసు స్మారక స్థూపం వద్ద ఇవాళ నివాళి అర్పించారు. కోవిడ్19 పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 343 మంది పోలీసు యోధులు ప్రాణాలు అర్పించినట్లు షా గుర్తు చేశారు. ముంబైలోని నాయిగావ్లో ఉన్న పోలీసు హెడ్క్వార్టర్స్లో సీఎం ఉద్దవ్ ఠాక్రే అమర పోలీసులకు నివాళి అర్పించారు. విజయవాడలో పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.