Advertisement

  • స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

By: Sankar Mon, 16 Nov 2020 10:00 AM

స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ


జైన ఆచార్య విజయ్‌ వల్లభ సురేశ్వర్‌ జీ మహరాజ్‌ 151వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మధ్యాహ్నం 12.30 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. రాజస్థాన్‌ రాష్ట్రం పాళీలోని జెట్‌పురాలోని విజయ వల్లభా సాధన కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 151 అంగుళాల పొడవు ఉన్న విగ్రహాన్ని.. అష్టధాతువుల (ఎనిమిది లోహాలు)తో తయారు చేయారు.

1870లో జన్మించిన విజయ్ వల్లభ సురేశ్వర్‌ జీ మహారాజ్ మహావీరుడి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు జీవితాంతం కృషి చేశారు. కవితలు, వ్యాసాలు, భక్తి శ్లోకాలతో ప్రజల సంక్షేమం, విద్యావ్యాప్తి, సామాజిక చైతన్యం కోసం పాటుపడ్డారు.

Tags :
|

Advertisement