Advertisement

  • జవానులకు మద్దతుగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించండి ..ప్రధాని మోడీ

జవానులకు మద్దతుగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించండి ..ప్రధాని మోడీ

By: Sankar Sun, 25 Oct 2020 4:02 PM

జవానులకు మద్దతుగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించండి ..ప్రధాని మోడీ


ప్రధాని మోడీ ఈరోజు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక దీపావళి, ఈద్ వంటి పండగలకు దేశంలోని ప్రజలు ఇంట్లో దీపాలు వెలిగించాలని, దేశ రక్షణ కోసం బోర్డర్ లో ప్రాణాలొడ్డి పోరాటం చేస్తున్న జవానులకు మద్దతుగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కోరారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియా, చైనా బోర్డర్ లో గాల్వాన్ ఘటన తరువాత రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. చైనా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. భారీ కట్టడాలను, ఆయుధాలను సమకూర్చుకుంటోంది. దీంతో ఇండియా కూడా అప్రమత్తం అయ్యి, సైన్యాన్ని బోర్డర్ కు తరలిస్తోంది. వేలాది మందిసైన్యం బోర్డర్లో మోహరించారు.

Tags :
|
|

Advertisement