Advertisement

  • డిసెంబర్ 25 న రైతుల అకౌంట్ లలో పీఎం కిసాన్‌ యోజన పథకం నగదు

డిసెంబర్ 25 న రైతుల అకౌంట్ లలో పీఎం కిసాన్‌ యోజన పథకం నగదు

By: Sankar Mon, 21 Dec 2020 10:11 PM

డిసెంబర్ 25  న రైతుల అకౌంట్ లలో  పీఎం కిసాన్‌ యోజన పథకం నగదు


క్రిస్మస్‌ పండుగ రోజున దేశంలోని రైతుల బ్యాంకు అకౌంట్లలో పీఎం కిసాన్‌ యోజన పథకం నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 80 మిలియన్ల మంది రైతులకు రూ.18,000 కోట్ల విలువైన చెల్లింపులు చేయనున్నారు.

క్రిస్మస్ రోజున రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మాట్లాడిన అనంతరం ఈ మొత్తాన్ని విడుదల జమచేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.2019 లో మొదటి విడత పీఎం కిసాన్‌ యోజనను ప్రధాని మోదీ విడుదల చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలోనే ప్రధాని మోదీ.. పీఎం కిసాన్‌ యోజన నిధులను రైతుల అకౌంట్లలో వేయాలని చూడటం విశేషం.ఈ సందర్భంగా రైతులతో ప్రధాని కొంత సేపు మాట్లాడతారని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు కొత్త వ్యవసాయ చట్టాల గురించి, అవి రైతులకు ఎలా మేలు చేస్తాయో ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు..

Tags :
|
|

Advertisement