‘ఐపీఎల్ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్’ ఆప్షన్ అందుబాటులోకి...ఐదుగురు ఆటగాళ్లపై
By: chandrasekar Tue, 13 Oct 2020 5:42 PM
ఐపీఎల్ 2020 లీగ్
లో అన్ని జట్లు ఏడేసి మ్యాచ్లు ఆడటంతో ‘ఐపీఎల్ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్’ ఆప్షన్
అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు ఈ విండో ద్వారా ఫ్రాంచైజీలు
ఇతర జట్లకు చెందిన ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ను బాగా ఆడుతున్న ముంబై, ఢిల్లీ
లాంటి ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ పేలవ ఆటతీరు
కనబరుస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ఇది గేమ్ ఛేంజర్లా
ఉపయోగించుకోవచ్చు. మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ
సీజన్లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ అయితే ఒకే విజయంతో చివరి
స్థానంలో ఉంది. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక జట్టుకు చెందిన ఆటగాణ్ని మరో
జట్టు లోన్గా తీసుకోవచ్చు. ఈ సీజన్లో ఈ ఐదుగురి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు చూపే
అవకాశం ఉంది.
క్రిస్ గేల్: టీ20ల్లో
విధ్వంసక బ్యాట్స్మెన్లలో ఒకడైన గేల్.. ఐపీఎల్ 2020లో పంజాబ్ జట్టులో
ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఓపెనర్లు మయాంక్, రాహుల్
అద్భుతంగా ఆడుతుండటంతో గేల్కు అవకాశం రాలేదు. పంజాబ్ గేల్ను ఓపెనర్గా
ఆడించి మయాంక్ను వన్డౌన్లో ఆడిస్తుందని
భావించారు. కానీ అనారోగ్యం కారణంగా గేల్ గత రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఫుడ్
పాయింజనింగ్ నుంచి కోలుకుంటే గేల్ పంజాబ్ తరఫున ఆడే అవకాశం ఉంది. ఒకవేళ పంజాబ్
అతణ్ని వద్దనుకుంటే తీసుకోవడానికి బోలెడన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
ఇమ్రాన్ తాహిర్: 2019లో
అద్భుతంగా ఆడిన ఇమ్రాన్ తాహిర్కు ఈ సీజన్లో చెన్నై తుది జట్టులో చోటు దక్కడమే
కష్టంగా మారింది. గత సీజన్లో 17 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీసిన తాహిర్.. ధోనీ సేన ఫైనల్ చేరడంలో
కీలక పాత్ర పోషించాడు. చాలా ఫ్రాంచైజీలు తాహిర్ తమ జట్టులో ఉండాలని కోరుకుంటాయి.
కానీ తమ ఛాంపియన్ బౌలర్ను వదులుకోడానికి చెన్నై ఇష్టపడుతుందా అనేదే అసలు సమస్య.
లాకీ ఫెర్గ్యుసన్: ఈ
న్యూజిలాండ్ పేసర్ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో
ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ కివీస్ బౌలర్ తన పేస్, బౌన్స్తో
అత్యుత్తమ బ్యాట్స్మెన్ను సైతం ఇబ్బంది పెట్టగలడు. పంజాబ్ జట్టులో విదేశీ
బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఫెర్గ్యూసన్ లాంటి బౌలర్ మిగతా మ్యాచ్ల్లో
పంజాబ్ తరఫున ఆడేలా చూడగలిగితే.. ఆ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
అజింక్య రహానే: రాజస్థాన్
రాయల్స్ను రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఢిల్లీ
ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ రాణిస్తుండటంతో రహానే చాలా మ్యాచ్ల్లో బెంచ్కే
పరిమితమయ్యాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా వారంపాటు దూరం కావడంతో రహానే తొలి మ్యాచ్
ఆడాడు. ఐపీఎల్లో నిలకడగా ఆడే రహానేకు మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఇలాంటి ఆటగాడు
చెన్నై సూపర్ కింగ్స్లో చేరితే చెన్నై బ్యాటింగ్ కష్టాలు తీరతాయి. దీంతో చెన్నై
సూపర్ కింగ్స్ రహానే కోసం చూసే అవకాశం ఉంది.
క్రిస్ లిన్: ఐపీఎల్
వేలానికి ముందు ఈ ఆస్ట్రేలియా హిట్టర్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయగా
ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ ఓపెనర్లు డికాక్, రోహిత్
రాణిస్తుంటంతో లిన్ ఇప్పటి వరకూ ఈ
సీజన్లో ఆడలేదు. లిన్ను రిలీజ్ చేసిన కోల్కతాను ఓపెనింగ్ సమస్య ఇబ్బంది
పెడుతోంది. దీంతో అతణ్ని తిరిగి జట్టులోకి తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తే కోల్కతాకు మంచి ఓపెనర్ దొరికినట్టే.