Advertisement

  • పాక్‌ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితిని కోరిన పీవోకే మొహద్ సజ్జాద్ రాజా

పాక్‌ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితిని కోరిన పీవోకే మొహద్ సజ్జాద్ రాజా

By: chandrasekar Sat, 26 Sept 2020 4:42 PM

పాక్‌ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితిని కోరిన పీవోకే మొహద్ సజ్జాద్ రాజా


పాక్‌ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస)ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన హక్కుల కార్యకర్త మొహద్ సజ్జాద్ రాజా కోరారు. పాకిస్థాన్‌ తమను జంతువుల్లా చూస్తోందని ఆరోపించారు. జెనీవాలో గురువారం జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో సజ్జాద్ మాట్లాడుతూ...పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆజాద్ కాశ్మీర్ ఎన్నికల చట్టం (2020) తమ రాజకీయ, పౌర, రాజ్యాంగ హక్కులను హరించివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ సొంత ప్రాంతంలో తమను దేశద్రోహులుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ తమను జంతువుల మాదిరిగా చూడకుండా నిలువరించాలని పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజల తరుఫున ఐరాసను తాను కోరుతున్నానని మొహద్ సజ్జాద్ రాజా అభ్యర్థించారు.

మరోవైపు పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్ ‌ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని పీవోకేకు చెందిన హక్కుల కార్యకర్త డాక్టర్ అమ్జాద్ ఎ మీర్జా డిమాండ్‌ చేశారు. గిల్గిట్‌బాల్టిస్థాన్‌లో రెండు వలసరాజ్యాలను తాము ఎదుర్కొంటున్నామని ఐరాస సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాముల నిర్మాణం వల్ల నదులు కుదించుకుపోతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని ఆయన కోరారు.

Tags :
|

Advertisement