సంగారెడ్డి లో కాల్పుల కలకలం... భయాందోళనకు గురైన స్థానికులు...!
By: Anji Mon, 16 Nov 2020 10:09 PM
సంగారెడ్డి లో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గం కాల్పులకు పాల్పడ్డారు.
దీంతో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో ఈ కాల్పుల కలకలం రేగింది. 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఓ వర్గం పై, ఇంకొక వర్గంకు చెందిన వ్యక్తి తుపాకీతో గాలిలో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపీ అక్కడి నుండి పారిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
సంఘటనా స్థలానికి చిరకూపల్లి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాల్పడింది ఎవరన్న దానిపై విచారణ చేపట్టారు.
పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా కొందరు పోలీసుల్ని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.