Advertisement

  • వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్న జగన్

వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్న జగన్

By: chandrasekar Fri, 02 Oct 2020 7:12 PM

వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్న జగన్


సీఎం జగన్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.

గ్రామాల్లో ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యం అందరికీ కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నారని అభినందించారు.

వీరిని అభినందిస్తూ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలని ప్రజలకు సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరారు.

తాను సాయంత్రం 7 గంటలకు బయటకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాననని అన్నారు. వాళ్లకు మన వంతు ఆదరణ చూపించాలని తెలిపారు.

Tags :
|
|

Advertisement