Advertisement

  • సెప్టెంబర్ 21 నుండి స్కూల్ కి అనుమతి... 9 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే: కేంద్ర ప్రభుత్వం

సెప్టెంబర్ 21 నుండి స్కూల్ కి అనుమతి... 9 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే: కేంద్ర ప్రభుత్వం

By: chandrasekar Wed, 09 Sept 2020 09:17 AM

సెప్టెంబర్ 21 నుండి స్కూల్ కి అనుమతి...  9 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే: కేంద్ర ప్రభుత్వం


సెప్టెంబర్ నెల అన్ లాక్ లో భాగంగా స్కూల్ రీ ఓపెనింగ్ గురించి ప్రస్తావించింది. ఈ నెల 21వ తేదీ నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్కూళ్లు తెరిచే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 9 నుంచి 12 తరగతుల వారికే స్కూళ్లు తెరవడానికి అనుమతి. టీచర్ల నుంచి గైడెన్స్ కోసం వారు వాలంటరీగా స్కూల్‌కు రావొచ్చు. అయితే, అందుకోసం విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తప్పనిసరి. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉండే స్కూళ్లు మాత్రమే తెరవాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ స్కూల్‌కు రాకూడదు.

కరోనా వ్యాపించకుండా స్కూల్లో విద్యార్థులు, టీచర్లు వినియోగించే ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. ఇప్పటి వరకు క్వారంటైన్ సెంటర్లుగా వినియోగించే స్కూళ్లను మరింత శుభ్రంగా, డీప్ క్లీనింగ్ చేయాలి. స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 50 శాతానికి మించి రాకూడదు. బయోమెట్రిక్ అటెండెన్స్ కాకుండా రిజిస్టర్ హాజరు తీసుకోవాలి. స్కూల్లో క్రీడలు, మార్నింగ్ అసెంబ్లీ లాంటివి నిషేధం. ప్రతి స్కూల్లోనూ రాష్ట్ర కోవిడ్ 19 హెల్ప్ లైన్ నెంబర్ విధిగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఆన్ లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు.

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సామాజిక దూరంలో భాగంగా కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్లు తప్పనిసరి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు వాడితే మంచిది. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చేతులు, కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. ఎవరి ఆరోగ్యం వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనారోగ్యం అనిపిస్తే వెంటనే ఇతరులకు తెలియజేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం పూర్తిగా నిషేధం.


Tags :

Advertisement