Advertisement

  • బీజేపీ బ‌హిరంగ స‌భ‌ నుండి లేచి వెళ్లిపోయిన జనం

బీజేపీ బ‌హిరంగ స‌భ‌ నుండి లేచి వెళ్లిపోయిన జనం

By: chandrasekar Sat, 31 Oct 2020 09:29 AM

బీజేపీ బ‌హిరంగ స‌భ‌ నుండి లేచి వెళ్లిపోయిన జనం


బీజేపీ బ‌హిరంగ స‌భ‌ నుండి జనాలు లేచి వెళ్లిపోయిన సంఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. దుబ్బాక‌లో బీజేపీకి జ‌నం గ‌ట్టి షాకే ఇచ్చారు. ఆ పార్టీ నేత‌, కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్‌రెడ్డి శుక్ర‌వారం దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు మ‌ద్ద‌తుగా కేంద్ర మంత్రి భూంపల్లి క్రాస్‌రోడ్స్‌-దుబ్బాక, పద్మనాయక ఫంక్షన్‌హాల్-సిద్దిపేట టౌన్‌, దుబ్బాక టౌన్‌, తిమ్మాపూర్‌-దుబ్బాక రూరల్‌ మండలాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు.

బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కిష‌న్‌రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. కాగా ఒక‌వైపు కేంద్ర‌మంత్రి ప్ర‌సంగం కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు జ‌నం లేచి వెళ్లిపోయారు. దీంతో జ‌నం లేక స‌భ వెల‌వెల‌పోయింది. దాదాపుగా ఖాళీయైన కూర్చీలతోనే కిష‌న్‌రెడ్డి ప్ర‌సంగం కొన‌సాగించారు. దీనివల్ల ఆయనకు భంగపాటు కలిగింది.

Tags :
|
|

Advertisement