Advertisement

  • లాక్ డౌన్ కొనసాగాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్ ‌ను కోరిన ప్రజలు

లాక్ డౌన్ కొనసాగాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్ ‌ను కోరిన ప్రజలు

By: chandrasekar Tue, 07 July 2020 3:18 PM

లాక్ డౌన్ కొనసాగాలని  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్ ‌ను కోరిన ప్రజలు


రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంగళవారం సమీక్ష జరపనున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి పలువురు నెటిజన్లు స్పందించారు.

హైదరాబాద్ ‌లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉందని, లాక్ డౌన్ విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓ నెటిజన్ గవర్నర్ ‌ను కోరారు.

కరోనా వ్యాప్తి, పరీక్షలు, ట్రీట్ మెంట్ విషయంలో చొరవ చూపాలని మరో నెటిజన్ కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో రోజుకు ఐదారువేల పరీక్షలే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని గవర్నర్ ‌ను పలువురు నెటిజ‌న్లు కోరారు.

హైదరాబాద్ లో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయని మరో నెటిజన్ తెలిపారు. హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కోరారు.

Tags :
|

Advertisement