లాక్ డౌన్ కొనసాగాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్ ను కోరిన ప్రజలు
By: chandrasekar Tue, 07 July 2020 3:18 PM
రాష్ట్రంలోని ప్రైవేటు
ఆస్పత్రుల యాజమాన్యాలతో మంగళవారం సమీక్ష జరపనున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్
లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి పలువురు నెటిజన్లు స్పందించారు.
హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి
దారుణంగా ఉందని, లాక్ డౌన్ విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓ
నెటిజన్ గవర్నర్ ను కోరారు.
కరోనా వ్యాప్తి, పరీక్షలు, ట్రీట్
మెంట్ విషయంలో చొరవ చూపాలని మరో నెటిజన్ కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ చర్యలు
తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రోజుకు
ఐదారువేల పరీక్షలే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని గవర్నర్ ను
పలువురు నెటిజన్లు కోరారు.
హైదరాబాద్ లో ప్రైవేటు
ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయని మరో నెటిజన్ తెలిపారు. హైదరాబాద్ లోని పలు
ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్
కోరారు.