Advertisement

  • మనీలా ప్రాంతంలో మరో తుపాను వామ్‌కోతో వణికి పోతున్న ప్రజలు...

మనీలా ప్రాంతంలో మరో తుపాను వామ్‌కోతో వణికి పోతున్న ప్రజలు...

By: chandrasekar Fri, 13 Nov 2020 12:16 PM

మనీలా ప్రాంతంలో మరో తుపాను వామ్‌కోతో వణికి పోతున్న ప్రజలు...


ఫిలిప్పీన్స్‌ భారీ తుపాన్లతో అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు.

ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి.

గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్‌ క్రాస్, రెడ్‌ క్రిసెంట్‌ పేర్కొన్నాయి.

Tags :
|

Advertisement