మాస్క్ ధరించకపోతే కరోనా కేంద్రాలలో సేవ చేయాలి...గుజరాత్ హైకోర్ట్
By: Sankar Wed, 02 Dec 2020 6:11 PM
ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాదిగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే...అయితే అగ్రరాజ్యం , చిన్న దేశం , సామాన్యుడు , సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరి మీద ఒకలాగే విరుచుకుపడుతున్న కరోనా ను ఆపేందుకు ఇంతవరకు వాక్సిన్ లాంటిది ఏమి లేకపోవడంతో మాస్క్ వాడకం తప్పనిసరి అయింది..అయినా కూడా చాల మంది ప్రజలు మాస్క్ వాడేందుకు అంతగా ఆసక్తి చూయించడంలేదు..
అందుకే ఆలా మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రంలో సేవ చేయాలని గుజరాత్ హైకోర్టు తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో నాలుగు నుంచి ఐదు గంటల పాటు సుమారు ఐదు నుంచి 15 రోజుల వరకు నాన్ మెడికల్ విధులు నిర్వహించాలని సూచించింది. క్లీనింగ్, హౌస్కీపింగ్, కుకింగ్, హెల్పింగ్, సర్వింగ్, రికార్డుల తయారీ, రికార్డులను భద్రపర్చడం వంటి పనులను మాస్కులు ధరించవారితో చేయించాలని పేర్కొంది.
జరిమానా విధించడంతోపాటు వ్యక్తుల వయసు, విద్యార్హత, జండర్, హోదా ప్రకారం ఆయా సేవలు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక విధానాన్ని రూపొందించి ఈ నెల 24న నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశాల్ అవతాపి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.