Advertisement

  • రామలింగారెడ్డి ఉన్నపుడే ఏ పనులు కానప్పుడు ఆయన భార్యతో ఎలా అవుతాయి ....పీసీసీ చీఫ్ ఉత్తమ్

రామలింగారెడ్డి ఉన్నపుడే ఏ పనులు కానప్పుడు ఆయన భార్యతో ఎలా అవుతాయి ....పీసీసీ చీఫ్ ఉత్తమ్

By: Sankar Wed, 28 Oct 2020 4:46 PM

రామలింగారెడ్డి ఉన్నపుడే  ఏ పనులు కానప్పుడు ఆయన భార్యతో ఎలా అవుతాయి ....పీసీసీ చీఫ్ ఉత్తమ్

దుబ్బాకలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు, బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు నాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.

అభివృద్ధి కావాలంటే ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎక్కడ ఉప ఎన్నికలైనా హరీష్ రావు ఒక్కటే మాట చెప్తున్నారని..సిద్దిపేట ఒక కన్ను అయితే ఇంకో ఊరు ఒక కన్ను అని ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రామలింగారెడ్డి బ్రతికుండగానే అసెంబ్లీలో తమ నియోజకవర్గంలో ఎలాంటి పనులు అవుతలేవని చెప్పారని అన్నారు

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి కి ఏమి పనులు కానపుడు మరి ఆయన భార్య తో అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలులేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకి ఎటువంటి ఉపాధి లేదని.. కవితకి మాత్రం ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ ఇచ్చారని ఫైర్ అయ్యారు.

Tags :
|

Advertisement