పవన్ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు...
By: chandrasekar Wed, 25 Nov 2020 10:56 AM
సోమవారం రాత్రి జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.. కానీ బీజేపీ పెద్దల్ని ఎవర్నీ కలవలేదనే
ప్రచారం జరుగుతోంది. పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారని
మీడియాలో కూడా హడావిడి కనిపించింది. అంతేకాదు పవన్ తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి
అంశంపై చర్చించేందుకు హస్తినకు వెళ్లారనే ఊహాగానాలు వినిపించాయి. రెండు రోజులుగా
జనసేన అధినేత ఢిల్లీలోనే మకాం వేయడం ఆసక్తి రేపింది. ఇదిలా ఉంటే పవన్కు అపాయింట్మెంట్
దొరకలేదనే ప్రచారంతో సోషల్ మీడియాలో వైఎస్సార్ కార్యకర్తలు-జనసైనికుల మధ్య వార్
జరుగుతోంది. ఢిల్లీలో పవన్ ఎదురుచూపులు. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ
పరిణామాలపై చర్చించేందుకు వెళ్లారు.. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు..
బీజేపీ అగ్రనాయకులతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు
సెటైర్లు పేలుస్తున్నారు. పవన్కు బీజేపీ కనీస గౌరవం ఇవ్వడం లేదని పరోక్షంగా
ఎద్దేవా చేశారు.
వైఎస్సార్సీపీ
కార్యకర్తలకు జనసైనికులు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. గతంలో వైఎస్ జగన్
ఢిల్లీ వెళ్లారని.. ఆయన కూడా ప్రధాని, కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారని
సెటైర్లు పేలుస్తున్నారు. బీజేపీ పెద్దలు బిజీగా ఉండటంతోనే భేటీ ఆలస్యం అయ్యిందని
జనసైనికులు అంటున్నారు. ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదు సరికాదంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో వైఎస్సార్సీపీకి భయం పట్టుకుందంటున్నారు.