Advertisement

  • కరోనా నిర్ములనలో పాటుపడేవారే కరోనా తో మరణించడం బాధాకరం ..పవన్ కళ్యాణ్ ..

కరోనా నిర్ములనలో పాటుపడేవారే కరోనా తో మరణించడం బాధాకరం ..పవన్ కళ్యాణ్ ..

By: Sankar Thu, 16 July 2020 9:17 PM

కరోనా నిర్ములనలో పాటుపడేవారే కరోనా తో మరణించడం బాధాకరం ..పవన్ కళ్యాణ్ ..



ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో నిత్యం పోరాడుతున్న పోలీసు అధికారులు, వైద్యులు మృతి చెందడం బాధాకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారిలో కొందరు ఆ మహమ్మారి కాటుకు బలైపోతుండడం చాలా బాధగా అనిపిస్తోందని ఆయన ఆవేదనకు లోనయ్యారు.

వైద్యం, పారిశుద్ధ్య, పోలీసు శాఖలకు చెందిన వారు మృతి చెందడం మనసు కలచివేసే విషాదమని పవన్ అన్నారు. నిన్న, మొన్న తిరుపతి, అనంతపురం నగరాల్లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరమన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడి కన్నుమూయడం దిగ్భ్రాంతికరమని పవన్ వ్యాఖ్యానించారు.

విధి నిర్వహణలో అశువులు బాసిన ఇరువురు పోలీస్ అధికారులకు, వైద్యులకు నా తరపున, జనసేన పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement