విద్యుత్ షాకుతో మరణించిన తన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
By: Sankar Wed, 02 Sept 2020 07:51 AM
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని.. అభిమానులు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతిచెందారు..
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.. జనసైనికుల మరణం మాటలకందని విషాదమని పేర్కొన్న ఆయన.. అభిమానుల మృతి తన మనసును కలచివేసిందన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేను.. కానీ, కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
ఆ వెంటనే.. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు పవన్ కల్యాణ్. కాగా ఈ రాజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బ్యానెర్లు కడుతూ విద్యుత్ షాక్ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించగా మరొక ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు