Advertisement

  • విద్యుత్ షాకుతో మరణించిన తన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

విద్యుత్ షాకుతో మరణించిన తన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

By: Sankar Wed, 02 Sept 2020 07:51 AM

విద్యుత్ షాకుతో మరణించిన తన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్


జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకుని.. అభిమానులు ప్లెక్సీలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేస్తుండ‌గా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు..

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర‌ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్.. జనసైనికుల మరణం మాటలకందని విషాదమని పేర్కొన్న ఆయ‌న‌.. అభిమానుల మృతి త‌న మ‌న‌సును క‌ల‌చివేసింద‌న్నారు. దూర‌మైన బిడ్డ‌ల‌ను తీసుకురాలేను.. కానీ, కుటుంబాల‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని హామీ ఇచ్చారు.

ఆ వెంట‌నే.. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల‌ చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. కాగా ఈ రాజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా బ్యానెర్లు కడుతూ విద్యుత్ షాక్ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించగా మరొక ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

Tags :
|

Advertisement