ఐపీయల్ స్పాన్సర్ పోటీలో పతాంజలి ..
By: Sankar Tue, 11 Aug 2020 11:34 AM
ఐపీయల్ టైటిల్ స్పాన్సర్ నుంచి వివో తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ దరఖాస్తులు కోరింది .అయితే దీనికి ప్రంపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి ... ఇప్పటికే ఈ రేసులో అమెజాన్ ముందు వరుసలో ఉండగా.. బైజూస్, జియో కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా యోగా గురు బాబ్ రాందేవ్కి చెందిన పతాంజలి కూడా ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్షిప్పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిడ్ వేసేందుకు పతాంజలి కసరత్తులు ప్రారంభించినట్లు పతాంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. టిజారావాలా వెల్లడించారు. పతాంజలిని గ్లోబల్ మార్కెట్లో ఉంచేందుకు ఐపీఎల్ సరైన వేదిక అని అతను అభిప్రాయపడ్డారు.
వివో స్థానంలో టైటిల్ స్ఫాన్సర్షిప్ కోసం బీసీసీఐ బిడ్స్ని ఆహ్వానించనుండగా.. వివో తరహాలో ఐపీఎల్ 2020 సీజన్కి రూ.440 కోట్లు స్ఫాన్సర్ చెల్లించే అవకాశాలు కనిపించడం లేదు. దానికి కారణం.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండటమే..అయితే స్ఫాన్సర్షిప్కి మాత్రం ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది.