విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లు ఇకపై వారం పాటు క్వారంటైన్
By: chandrasekar Mon, 25 May 2020 1:04 PM
విదేశాల నుంచి వచ్చే
ప్యాసింజర్లు ఇకపై వారం పాటు క్వారంటైన్ సెంటర్లో
ఉంటే సరిపోతుందని, మరో
వారం హోం క్వారంటైన్ లో
ఉండాలని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ
తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ సెంటర్లో ఉండడానికి అయిన ఖర్చులను ఎవరికి
వారే భరించాలని పేర్కొంది. గమ్యం చేరాక 14 రోజుల
పాటు క్వారంటైన్ లో ఉంటానని ఫ్లైట్
ఎక్కడానికి ముందే ప్యాసింజర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది.
ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల ను రెగ్యులర్ గా శానిటైజ్/ డిస్ ఇన్ ఫెక్టెడ్ చేయాలి. ప్యాసింజర్స్ కోసం సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ప్రయాణం ముగించుకొని
దిగినవాళ్లలో 14
రోజుల్లో లక్షణాలు బయటపడితే డిస్ట్రిక్ సర్వైలైన్స్ ఆఫీసర్, స్టేట్/నేషనల్ కాల్ సెంటర్ 1075కు సమాచారమివ్వాలి.
ఎయిర్ పోర్టులు, రైల్వే
స్టేషన్లు, బస్టాండ్లలో
థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు
చేయాలని, ప్యాసింజర్స్ టెంపరేచర్ ను టెస్ట్ చేయాలని
ఆదేశించింది. సోమవారం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్, జూన్ 1 నుంచి
100 రైళ్లు ప్రారంభం కానున్నందున సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ
తాజాగా ఆదివారం గైడ్ లైన్స్ విడుదల
చేసింది. ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ కంపల్సరీ.
ఆరోగ్య సేతు యాప్ ను ప్యాసింజర్స్ తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి.
ప్రతి ప్యాసింజర్ తప్పనిసరిగా
ఫేస్ మాస్కు ధరించాలి. ప్యాసింజర్స్ కు సూచనలను టికెట్లతోపాటు ట్రావెల్ ఏజెన్సీలు ముంద్రించి
ఇవ్వాలి. కొవిడ్ –19
నివారణపై ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో
ప్రకటనలు డిస్ ప్లే చేయాలి. హ్యాండ్స్ ను శానిటైజ్ చేసుకోవాలి.
డిస్టెన్సింగ్ ను పాటించాలి. వాటిని
ప్యాసింజర్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు కరోనా లక్షణాలు బయటపడితే
సమీపంలోని ఐసోలేషన్ సౌలతు ఉన్న హాస్పిటల్ కు తరలించాలి. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని
ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మైల్డ్ సింప్టమ్స్ ఉంటే హోం
ఐసోలేషన్ గానీ, కొవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్ లో గానీ ప్యాసింజర్స్ కే ఆప్షన్ ఇవ్వాలి.
కరోనా లక్షణాలు
ఉన్నవాళ్లలో పాజిటివ్ అని తేలితే.. కొవిడ్ హాస్పిటల్స్ లోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇవ్వాలి. నెగెటివ్ అని తేలితే
ఇంటికెళ్లేందుకు అనుమతిం చొచ్చు. అలాంటివాళ్లు వారంపాటు హోం ఐసోలేష న్ లో ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని 1075 కాల్ సెంటర్ కు గానీ
సమాచారం అందించాలి. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు క్వారం టైన్ /ఐసోలేషన్ కు సంబంధించి సొంత ప్రొటోకాల్ ను డెవలప్ చేసుకోవచ్చు.
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ పాటించాల్సిన
గైడ్ లైన్స్ ను కూడా సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ
విడుదల చేసింది. ఆగస్టుకు ముందే ఇంటర్నేషనల్ విమానాలను
ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ
ఏర్పాట్లు చేస్తున్నందున ఈ గైడ్ లైన్స్ విడుదలయ్యాయి. కరోనా లక్షణాలు లేని ప్యాసింజర్స్ ను మాత్రమే అనుమతించాల్సి ఉంటుందని, అయితే.. ప్యాసింజర్ తప్పనిసరిగా
తాను 7 రోజులు క్వారంటైన్ సెంటర్లలో
సొంత ఖర్చులతో, మరో 7 రోజులు హోం క్వారంటైన్ లో (14రోజులు) ఉంటానని సెల్ఫ్ డిక్లరేషన్ ను బోర్డింగ్ కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణులు, ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చేవాళ్లు, పదేండ్లలోపు పిల్లలకు, ప్రత్యేక కారణాలతో వచ్చినవారికి మాత్రం 14 రోజుల హోం క్వారంటైన్ కు అనుమతించొచ్చని మినిస్ట్రీ స్పష్టంచేసింది.
ప్యాసింజర్స్ రాకపోకల
టైంలో తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. వైరస్ లక్షణాలు బయటపడితే.. వెంటనే ఐసోలేషన్ కు తరలించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ తప్పకుండా
ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అందులో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అందుబాటులో
ఉంటుందని సూచించింది.