తిరుపతి ఉప ఎన్నికలపై దృష్టి సారించిన పార్టీలు...
By: chandrasekar Tue, 15 Dec 2020 9:43 PM
తిరుపతి ఉప ఎన్నికలలో
భాగంగా ప్రధాన పార్టీలన్నీ నోటిఫికేషన్ రాకముందే పనులు ప్రారంభం చేసేశాయి.
టీడీపీఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించి౦ది. డాక్టర్ గురుమూర్తిని
వైఎస్సార్సీపీ బరిలోకి దించబోతుందనే వార్తలు కాస్తున్నాయి. వైఎస్సార్సీపీ కూడా
ఉప ఎన్నికపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తిరుపతిలో
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య
నేతలు భేటీ జరిపారు. టీడీపీఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా ఇక
జనసేన, బీజేపీలు
అభ్యర్థి ఎంపిక గురించి తెలియరాలేదు. ఉప ఎన్నికల విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందింఛాలని సూచించారు. ఉప
ఎన్నికను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే ముఖ్యమంత్రి జగన్ ద్వారా ఇళ్ల స్థలాల
పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 25న ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు
ముఖ్యమంత్రికి ప్రతిపాదనను పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికపై కసరత్తులో
భాగంగా ఈ నెల 27న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్నితిరుపతిలో
నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాంతాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలు
అప్పగిస్తారని తెలుస్తోంది.