Advertisement

  • తట్టు, పోలియో టీకాలను ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలి: డబ్ల్యూహెచ్‌ఓ...

తట్టు, పోలియో టీకాలను ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలి: డబ్ల్యూహెచ్‌ఓ...

By: chandrasekar Mon, 09 Nov 2020 6:30 PM

తట్టు, పోలియో టీకాలను ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలి: డబ్ల్యూహెచ్‌ఓ...


కరోనా వైరస్ వ్యాప్తి వ్యాధుల నిర్ధారణ, చికిత్స సాధారణ టీకాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది కరోనా మహమ్మారి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలను కోల్పోయేలా చేసినట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారి కీలక రోగనిరోధకత కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంపై యునిసెఫ్, యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్, డబ్ల్యూహెచ్‌ఓలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కోట్లాది మంది పిల్లలు పోలియో, మీజిల్స్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నదని విచారం వ్యక్తం చేశాయి. టోక్ హీ యూఎన్ ఏజెన్సీల ప్రకారం కొన్ని దేశాలలో రోగనిరోధకత రేట్లు 50 శాతం తగ్గాయి. లాక్‌డౌన్, రవాణా అంతరాయాలు, కరోనాకు గురవుతారనే భయంతో ఆరోగ్య సేవలను పొందలేకపోతున్నారు. అవసరమైన సేవల్లో అంతరాలను పూరించడానికి రూపొందించిన పోలియో, మీజిల్స్ టీకా శిబిరాలు కూడా ఆరోగ్య కార్యకర్తల్లో వ్యాప్తిని నివారించడానికి విరామం ఇవ్వవలసి వచ్చింది. "ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆరోగ్య సేవలపై, ప్రత్యేకించి రోగనిరోధకత సేవలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది" అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ విచారం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌ మార్గదర్శకాలను పాటిస్తూనే తట్టు, పోలియో టీకాలను ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని, అలాగే ఆరోగ్య కార్యకర్తలు ఈ రోగనిరోధక సేవలను కొనసాగించాలని సూచించారు. 655 మిలియన్ డాలర్లు అవసరంయునిసెఫ్, డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, మధ్య-ఆదాయ దేశాలలో ప్రమాదకరమైన రోగనిరోధక శక్తి అంతరాలను పూరించడానికి 655 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పోలియో వ్యాప్తి ప్రతిస్పందనకు మద్దతు ఇవ్వడానికి సుమారు 400 మిలియన్ డాలర్లు అవసరమవుతాయి. 2020-21లో రాబోయే మూడేండ్లలో మీజిల్స్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి 255 మిలియన్ డాలర్ల సాయం అవసరం అవుతాయని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది.

Tags :

Advertisement