ముంబై ఎయిర్పోర్టులో అధికారుల అదుపులోకి పాండ్య....
By: chandrasekar Fri, 13 Nov 2020 10:59 AM
కరోనా వల్ల ఐపీఎల్ మ్యాచ్
లను యూఏఈ లో నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన
పాండ్యను ముంబై ఎయిర్పోర్టులో అధికారులు తిరుగు ప్రయాణంలో అదుపులోకి
తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్, హార్దిక్
పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్-13లో పాల్గొన్న కృనాల్ టోర్నీ అనంతరం యూఏఈ నుంచి
ముంబైకి వచ్చాడు. ఇక్కడ ఎయిర్ పోర్టు తనికీలో అతను పట్టుబడ్డాడు.
ముంబై ఎయిర్పోర్టులో
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అతన్ని అదుపులోకి
తీసుకున్నట్లు సమాచారం. లెక్కల్లో చూపని బంగారం ఆభరణాలు, విలువైన
వస్తువులు విదేశం నుంచి తీసుకురావడంతో డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. బంగారం, ఇతర
విలువైన వస్తువులపై కృనాల్ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇతను ఐపీఎల్
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబై లీగ్ చరిత్రలో
ఐదోసారి టైటిల్ నెగ్గింది. విన్నింగ్ టీమ్లో పాండ్య సోదరులు ఉన్న విషయం
తెలిసిందే.