Advertisement

సంగీత విద్వాంసుడు జస్రాత్‌ ఇకలేరు

By: Dimple Mon, 17 Aug 2020 11:19 PM

సంగీత విద్వాంసుడు జస్రాత్‌ ఇకలేరు

ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిత్ జస్రాజ్ (90) తుది శ్వాస విడిచారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. జస్రాజ్ 70 ఏళ్ల పాటు భారతీయ శాస్త్రీయ సంగీతంతో అలరించారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, శిష్యులు ఉన్నారు. జస్రాజ్ అస్తమయంతో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఓ శకం ముగిసినట్టయింది.

14 ఏళ్ల వయసులోనే గాయకుడిగా శిక్షణ ప్రారంభించిన జస్రాజ్.. నిత్యం 14 గంటలు పాటు సంగీత సాధన చేసేవారు. సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన పండిత్ జస్రాజ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది. దీంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు.

జస్రాజ్ వద్ద సంగీతం నేర్చుకున్న చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం జతిన్ లలిత్.. జస్రాజ్ కుమారులే. ప్రముఖ నటి, గాయని సులక్షణ పండిత్, విజేత పండిత్ జస్రాజ్ కుమార్తెలే. జస్రాజ్‌ పెద్దన్నయ్య పండిత్ మణిరామ్ కూడా ప్రముఖ సంగీత విద్వాంసులే.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు జస్రాజ్ మృతికి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఆయనతో తన జ్ఞాపకాలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

Tags :
|

Advertisement