Advertisement

పళనిస్వామియే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి...

By: chandrasekar Tue, 22 Dec 2020 2:03 PM

పళనిస్వామియే ఎన్డీఏ ముఖ్యమంత్రి  అభ్యర్థి...


తమిళనాడులో కొన్నివారాలుగా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిపై అటు ఏఐఏడీఎంకే, బీజేపీల్లో చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామియే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నారనే వార్తలను బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ ధ్రువీకరించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

జాతీయ పార్టీగా పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే అన్నామలై కోయంబత్తూరులో చెప్పారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన పొంగల్‌ బహుమతులపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెలాఖరులో తమిళనాడులో పోల్ పరిస్థితిని సమీక్షించేందుకు వస్తున్నారు. ఆ సమయంలో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 2021 ఎన్నికలకు ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏఐఏడీఎంకే అక్టోబర్‌లో ప్రకటించింది. పళనిస్వామి శనివారం తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.

Tags :
|
|
|

Advertisement