పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
By: chandrasekar Wed, 09 Dec 2020 11:32 AM
ప్రస్తుత పాకిస్తాన్
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు ప్రముఖ క్రికెటర్. ఇతను 1992లో
పాకిస్తాన్ కు వరల్డ్ కప్ అందించాడు. ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్ లోను మరియు
బౌలింగ్లోనూ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారుడు. అతను బౌలింగ్ తో ప్రత్యర్థి
బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురి చేసేవాడు.
క్రికెట్ నుండి అతను విరామం పొందిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి పాకిస్తాన్
ప్రధానిగా ఎన్నికయ్యాడు.
ప్రస్తుతం పాకిస్తాన్
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏమైందో అర్థం కావడం లేదు. అతను తన ట్విట్టర్ ఖాతాలో
ఎవరిని ఫాలో అవ్వడం లేదు మరియు అందర్నీ అన్ ఫాలో అవుతున్నాడు. ఆయన మొదటి భార్య
జెమిమా గోల్డ్ స్మిత్ తో సహా అందర్నీ ట్విటర్ ఖాతాలో అన్ ఫాలో అవుతున్నాడు. అతను మొదటగా 2010లో తన ట్విట్టర్ ఖాతాను
తెరిచాడు. ఇప్పటివరకు అతనికి ట్విట్టర్ ఖాతాలో 12.9 మిలియన్ల ఫాలోఎర్స్
వున్నారు. ఇప్పుడు అతని నిర్ణయంపై సోషల్ మీడియాలో
నెటిజన్ అందరూ అతనిపై ట్రోల్
చేస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం గత ప్రధాని
నవాజ్ షరీఫ్ ను కలిసినట్టు ఉన్నాడు. అందువల్ల ఎవరిని ఫాలో కావడం లేదు అతను కూడా
నవాజ్ షరీఫ్ బాటలోనే ప్రయాణిస్తున్నట్లు వున్నాడని తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ గతంలో చాలా
మందిని ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారు. ఆయన మూడో వివాహం చేసుకున్నా తరువాత కూడా మొదటి భార్య జెమిమా గోల్డ్ స్మిత్ ను ట్విట్టర్
లో ఫాలో అయ్యేవారు. కానీ తాజాగా అందర్నీ అన్ ఫాలో కావడం వెనక ఆంతర్యమేమో ఎవ్వరికి
అర్ధం కావడం లేదు. ఆయన మీద ట్రోల్స్ మాత్రం నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి.
గత కొంతకాలంగానే అయన డిప్రెషన్లో ఉన్నట్లు చెపుతున్నారు.