Advertisement

  • డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్న పాకిస్తాన్

డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్న పాకిస్తాన్

By: chandrasekar Wed, 23 Sept 2020 10:35 AM

డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్న పాకిస్తాన్


మన దాయాధి దేశమైన పాకిస్థాన్ డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్న తెలిసింది. అడ్డదారులు తొక్కడంలో పాకిస్థాన్‌ కొత్త పద్ధతులు అవలంబిస్తోంది. జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు ఏకే-47 వంటి ఆయుధాలను అందించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. రాత్రివేళల్లో దొంగచాటుగా ఈ చర్యలను అమలు చేస్తోంది. అందువల్ల దీనిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తుంది.

ఈ ఆయుధాలు చేరవేయడంపై జమ్మూ-కశ్మీరు పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం అఖ్నూర్ సెక్టర్‌లోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి అజాల్ట్ రైఫిల్స్, ఓ పిస్టల్ దొరికాయి. వీటిని ఉగ్రవాదులకు అందజేయడం కోసం డ్రోన్ల ద్వారా రాత్రి వేళల్లో వీటిని పాకిస్థాన్ జారవిడుస్తోంది. సాక్ష్యాధారాలనుబట్టి ఈ సంఘటన వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాత్ర కనిపిస్తోంది. వీరికి ఆయుధాలు అందించడం ద్వారా ఉగ్రవాద కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుంది.

జమ్మూ కశ్మీరులోని పుల్వామా సహా అనేక ఉగ్రవాద దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే. స్పష్టమైన సమాచారం అందిన తర్వాత జమ్మూ-కశ్మీరు పోలీసులు జాద్ సోహాల్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రెండు ఏకే అజాల్ట్ రైఫిల్స్, ఒక పిస్టల్, మూడు ఏకే మ్యాగజైన్స్ , 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కన్‌సైన్‌మెంట్ల ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.

Tags :

Advertisement