మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్, ఇంగ్లాండ్తో తొలి టెస్టుకి పాకిస్థాన్ టీమ్ ప్రకటన
By: chandrasekar Tue, 04 Aug 2020 8:45 PM
పాకిస్థాన్ ఇంగ్లాండ్తో
మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్కి జట్టుని
పాకిస్థాన్ ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ టెస్టు ఆరంభంకానుండగా 16
మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కి చోటు లభించింది. పాక్
తరఫున గత ఏడాది అక్టోబరులో చివరిగా సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్లు ఆడాడు.
శ్రీలంకతో గత ఏడాది పాక్
గడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్లో పాక్ ఓడిపోవడంతో.. ఆగ్రహించిన పాకిస్థాన్
క్రికెట్ బోర్డు సర్ఫరాజ్ అహ్మద్ని కెప్టెన్సీ నుంచే కాకుండా టీమ్ నుంచి కూడా
తప్పించిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్, పాకిస్థాన్
మధ్య బుధవారం నుంచి మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుండగా ఈ సిరీస్ని పూర్తి బయో-
సెక్యూర్ వాతారణంలో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది. ఈ
మేరకు నెల రోజులు ముందుగానే పాకిస్థాన్ జట్టుని అక్కడికి రప్పించుకున్న ఈసీబీ..
కరోనా వైరస్ పరీక్షలు, 14 రోజులు క్వారంటైన్లో ఉంచి ఇరు జట్ల ఆటగాళ్లని బయో-
సెక్యూర్ బబుల్లోకి చేర్చింది. ఒక్కసారి క్రికెటర్లు, మ్యాచ్
అధికారులు ఈ బబుల్లోకి ఎంటరైన తర్వాత సిరీస్ ముగిసే వరకూ వెలుపలికి రాకూడదు.
ఇంగ్లాండ్తో తొలి
టెస్టుకి పాకిస్థాన్ జట్టు ఇదే: అజహర్ అలీ (కెప్టెన్), బాబర్
అజామ్, అబిద్
అలి, అసద్
షాఫిక్, పవాద్
అలామ్, ఇమామ్
ఉల్ హక్, ఖాసిప్
భట్టీ, మహ్మద్
అబ్బాస్, మహ్మద్
రిజ్వాన్, నసీమ్
షా, సర్ఫరాజ్
అహ్మద్, షదాబ్
ఖాన్, షాహీన్
షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, యాసీర్ షా