భారత దౌత్య అధికారికి పాకిస్థాన్ సమన్లు జారీ
By: chandrasekar Sat, 19 Sept 2020 6:10 PM
సరిహద్దులో కాల్పుల విరమణ
ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘించడంపై నిరసన తెలిపింది. ఈ
కారణంగా భారత దౌత్య అధికారికి పాకిస్థాన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి హాట్స్ప్రింగ్, జాండ్రోట్
సెక్టార్లలో గురువారం భారత ఆర్మీ విచక్షణ రహితంగా కాల్పులు జరిపిందని పాకిస్థాన్
విదేశాంగ శాఖ కార్యాలయం ఆరోపించింది.
ఈ కాల్పుల వల్ల 15 ఏండ్ల
ఇరుమ్ రియాజ్, ఆండ్రాల నార్ గ్రామానికి చెందిన 16 ఏండ్ల
ముఖీల్, 26 ఏండ్ల
నుస్రత్ కౌసర్ గాయపడినట్లు తెలిపింది. సరిహద్దులోని పాక్ గ్రామాల ప్రజలను భారత
ఆర్మీ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నదని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లోని
భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్య అధికారిని తమ వద్దకు
పిలిపించుకుని నిరసన తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఆర్మీ 2,280
సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని, 18 మంది
పాక్ పౌరులు మరణించారని ఆ దేశం పేర్కొంది.
2003లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన భారత్ దానికి
కట్టుబడి ఉండటం లేదని పాకిస్థాన్ ఆరోపించింది. కాగా భారత దౌత్య అధికారికి పాక్
సమన్లు జారీ చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. గత వారం కూడా ఇదే అంశంపై భారత దౌత్య
సీనియర్ అధికారిని పిలిపించుకుని పాక్ నిరసన వ్యక్తం చేసింది.